లాక్ డౌన్ ఓ యువతి ప్రాణం తీసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మణికొండ ల్యాంకోహిల్స్ అపార్ట్ మెంట్ లో కృష్ణా జిల్లా నందిగామ ప్రాంతానికి చెందిన ఈరవల్లిక అనే యువతి పనికి కుదిరింది. ఈరవల్లికి 20 సంవత్సరాలుంటాయి. ఆమె ఫిబ్రవరి 29 నుంచి అక్కడ పని చేస్తుంది. వారం రోజుల క్రితం ఈరవల్లిక అక్క పాపకు జన్మనిచ్చింది. దీంతో తాను ఇంటికి వెళ్లాలని భావించింది. తల్లికి ఫోన్ చేయగా ప్రస్తుతం ఊరికి ఎవరిని రానివ్వడం లేదని తెలిపింది. హైదరాబాద్ నుంచి ఎలాగో అలా వెళ్లాలనుకున్నా రవాణా సౌకర్యాలు లేకపోవడంతో తాను మానసిక వేదనకు గురయ్యింది. బుధవారం ఉదయం తాను పని చేస్తున్న అపార్ట్ మెంట్ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రాయదుర్గం ఇన్ స్పెక్టర్ రవీంద్ర తెలిపారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa