ఏపీ కరోనా హెల్త్ బులెటిన్ విడుదలైంది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 38 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2018కి చేరుకుంది. కరోనాతో ఇప్పటి వరకు ఏపీలో 45 మంది మరణించారు. 998 మంది కోలుకోని డిశ్చార్జు అయ్యారు. ప్రస్తుతం ఏపీలో 2018 యాక్టివ్ కేసులున్నాయి.ఇప్పటి వరకు జిల్లాల వారీగా నమోదైన కరోనా వైరస్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపూర్ 115, చిత్తూరు 121, తూర్పుగోదావరి 46, గుంటూరు 387,కడప 97, కృష్ణా 342, కర్నూలు 575, నెల్లూరు 102,ప్రకాశం 63, విశాఖ పట్నం 66, పశ్చిమ గోదావరి 68, శ్రీకాకుళంలో 5, విజయనగరంలో 4 కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఉన్న ఇతర రాష్ట్రాలకు చెందిన వారిలో 27 మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది.జిల్లాల వారీగా డిశ్చార్జి అయిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం 45, చిత్తూరు 74, తూర్పుగోదావరి 31, గుంటూరు 198, కడప 45, కృష్ణా 142, కర్నూలు 267, నెల్లూరు 76, ప్రకాశం 60, విశాఖపట్నం 25, పశ్చిమగోదావరి 33, శ్రీకాకుళం 2 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 998కి చేరింది.అదే విధంగా కరోనాతో అనంతపూర్ లో 4, కృష్ణా జిల్లాలో 13,గుంటూరులో 8, కర్నూల్ లో 16, నెల్లూరులో 3,విశాఖపట్నంలో 1 చనిపోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 45 మంది కరోనాతో చనిపోయారు.ఏపీలో మొత్తం 2018 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 998 మంది డిశ్చార్జ్ అయ్యారు. 45 మంది మరణించారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 975 ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa