ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2013లో ఆంధ్రప్రదేశ్‌ ను చుట్టుముట్టిన మిస్టరీ జ్వరాలు!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 10, 2020, 01:41 PM

2013లో రాష్ట్రంలో 17,29,622 మందిని జ్వరాలు తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. చిత్తూరులో అత్యధిక సంఖ్యలో 1,73,459 జ్వరం కేసులు నమోదయ్యారు. అనంతపురంలో 1,29,391, ఆదిలాబాద్ 1,03,293 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ఎపిడెమియాలజీ విభాగం రాష్ట్రంలోని మొత్తం జ్వరాల డేటాను నమోదు చేసింది.

మలేరియా, డెంగ్యూ, క్షయ, చికున్‌గున్యా, స్వైన్ ఫ్లూ మరియు ఇతర అంటువ్యాధులు వచ్చినప్పుడు జ్వరం రావడం సాధారణం. ఆ సమయంలో రోగనిర్ధారణ పరీక్షలు చేసి జర్వం ఎందుకు వచ్చిందోనని నిర్దారించవచ్చు. కానీ 2013లో వచ్చిన ఆ జ్వరాలు ఎందుకు వచ్చాయోనని వైద్యులు నిర్దారించకపోయారు. వాటిని మిస్టరీ జ్వరాలుగా పేర్కొన్నారు. గాంధీ ఆసుపత్రిలోని ఇంటర్నల్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ బి. నర్సిములు మాట్లాడుతూ.. జ్వరం గురించి కొన్ని విషయాలు తెలియజేశారు. శరీర సాధారణ ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెంటీగ్రేడ్‌ లేదా 98.6 డిగ్రీల ఫారెన్‌ హీట్‌గా ఉంటుంది. దీనికంటే ఉష్ణోగ్రత పెరిగినప్పుడు 'జ్వరం' వచ్చిందనవచ్చు.

కొన్ని ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో వ్యాయామం చేశాక, గర్భిణిగా ఉన్నప్పుడు, బహిష్టు సమయంలో కూడా కొంత ఉష్ణోగ్రత పెరగొచ్చు. జ్వరం శరీరంలో జరుగుతున్న మార్పులకుఒక హెచ్చరికే కాదు. శరీరంలో చేరిన సూక్ష్మజీవులను నశింపజేసే ఒక రక్షణ ప్రక్రియ కూడా. జ్వరం రావడానికి అనేక కారణాలున్నాయి. బ్యాక్టీరియా, వైరస్‌, ఫంగైలాంటి సూక్ష్మజీవులు వల్లే కాక గాయాలు, గుండెపోటు, క్యాన్సర్‌ లాంటి సమస్యల వల్ల కూడా జ్వరం రావొచ్చు. మందుల వల్ల కూడా జ్వరం రావొచ్చు. దీన్ని డ్రగ్‌ ఫీవర్‌ అంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa