కేంద్రం ప్రభుత్వం అందించే పథకాలలో రైతు సంక్షేమ పథకాలు కూడా ఉన్నాయి. ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన కూడా ఇందులో ఒక భాగమే. ఈ పథకంలో భాగంగా రైతులు పెన్షన్ పొందొచ్చు. పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన స్కీమ్ 18 నుంచి 40 ఏళ్ల వయసు ఉన్న రైతులకు వర్తిస్తుంది. 60 ఏళ్ల వరకు డబ్బులు కడుతూ రావాలి. నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్ల తర్వాత రైతులకు పెన్షన్ వస్తుంది. నెలకు రూ.3 వేల పెన్షన్ తీసుకోవచ్చు. అంటే సంవత్సరానికి రూ.36,000 వస్తాయి. ఇప్పటి వరకు అయితే ఈ స్కీమ్లో దాదాపు 20 లక్షల మంది రైతులు చేరారు.లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈ స్కీమ్ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటోంది. 5 ఎకరాల లోపు పొలం కలిగిన వారు ఈ స్కీమ్లో చేరొచ్చు. 18 ఏళ్ల వయసులో స్కీమ్లో చేరితే నెలకు రూ.55 కట్టాలి. అంటే సంవత్సరానికి రూ.660 అవుతుంది. అదే 40 ఏళ్ల వయసులో స్కీమ్లో చేరితో నెలకు రూ.200 చెల్లించాలి. అంటే సంవత్సరానికి రూ.2,400 కట్టాలి. అప్పుడు వీరికి 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3,000 పెన్షన్ వస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా రైతులు చెల్లించే మొత్తానికి సమానమైన మొత్తాన్ని మాన్ ధన్ అకౌంట్కు చెల్లిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa