ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ సర్కారుపై కేశినేని నాని ఛాలెంజ్..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 03, 2020, 05:33 PM

ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ లాక్ డౌన్ ను చేపట్టడంలో కొన్ని ప్రత్యేక చర్యలను తీసుకుంది. మరి దిగువ తరగతి సాయం అందని వారి పరిస్థితి ఏమిటి? వారికి రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి దీనితో అలాంటి వారికి సాయం అందించేందుకు అనేక మంది కదిలారు. అలా మన రాజకీయ నాయకులు కూడా చాలా తక్కువ మందే కదిలారు. అలాంటి తక్కువ మందిలోనే టీడీపీ ఎంపీ కేశినేని నాని కూడా ఒకరు.ఈ మధ్య కాలంలో ప్రత్యకు అతీతంగా ఎన్నో వందల మందికి నాని సాయం అందించారు సోషల్ మీడియాలో ఎవరైనా సాయం కావాలి అంటే తన వంతు సహకారం అందించారు. కానీ ఆయన సామాజిక దూరం పాటించలేదని అధికార పార్టీ కేసు నమోదు చెయ్యగా అందుకు నాని గట్టి సమాధానమే ఇచ్చారు.“దొంగ కేసులకు భయపడి పేదలకు ఆపదలో వున్న వారికి సేవ చేయడం మానేస్తా అని అనుకుంటున్నారా? ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తా ఎన్ని దొంగ కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి” అంటూ సవాలు విసిరారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa