ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా చంద్రబాబు వ్యవహరిస్తున్న పని తీరుపై తన నియోజకవర్గ ప్రజలే బాధపడుతున్నారు.తమ బాధను అంతా వెళ్లగక్కుకొని ఒక లేఖ రూపంలో బయటకు వదలగా అది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే అది నిజంగానే అక్కడి ప్రజలు రాసారో లేదో కానీ ఆ లేఖలో బాబు పట్ల తమ అసహనాన్ని బాధను ఒకేసారి వెల్లడించుకున్నారు. తమకు గెలిపించుకున్న మీరు లాక్ డౌన్ ను బాగా పాటిస్తున్నారు బాగానే ఉంది.మీకంటే కోటను కోట్ల ఆదాయం ఉంది మీలా ఆదాయం ఉన్న వారు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎలా లేదన్నా ఆరు నెలలు బ్రతికేస్తారు. కానీ మేము అలా కాదు ప్రభుత్వం ఇస్తున్న చాలీ చాలని సరుకులతో తమ జీవనం గడపడం కష్టంగా ఉందని ఇప్పటికే పక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తమ ప్రజలకోసం తమ సొంత డబ్బులు తీసి మరీ కూరగాయలు ఇతర సరుకులు పంపిణీ చేస్తున్నారని.ఇలాంటి విషయం మీపాటి వారికి చాలా చిన్నది అని కానీ మీరు ఎందుకు అలా చెయ్యడం లేదని ప్రస్తావించారు.దీంతో మేము ఎవరి వైపు చూడాలి,తమ కోసం ఒక్క సారి కూడా ఆలోచించని మీరు రాజకీయ నాయకుడు అని చెప్పుకోడానికి సిగ్గుపడండి అంటూ మళ్ళీ మిమ్మల్నే గెలిపించుకుంటాం మాకు బాగా బుద్ది చెప్పారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa