ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో కరోనా విలయతాండవం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 03, 2020, 05:16 PM

ఏపీలో కరోనా తన పంజా విసురుతోంది. 24 గంటల్లో నిర్వహించిన కోవిడ్‌ 19 పరీక్షల్లో 6534 సాంపిల్స్ ని పరీక్షించగా 58 మందికి కరోనా పాజిటివ్‌గా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్యశాఖ తన బులిటెన్‌ ద్వారా తెలిపింది. దీంతో ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా బాధితుల సంఖ్య 1583కి చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకున్న 488 మందిని డిశ్చార్జి చేశారు. కరోనాతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 33 మంది మృతి చెందారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1062.


గత 24 గంటల్లో జిల్లాల వారిగా నమోదైన కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.


కర్నూల్ జిల్లాలో 30,


గుంటూరు జిల్లాలో 11,


కృష్ణా జిల్లాలో 8,


అనంతపురం లో 7 కేసులు నమోదయ్యాయి.


రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా కర్నూల్ జిల్లాలో 466 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత గుంటూరు జిల్లాలో 319 కేసులు నమోదయ్యాయి. కృష్ణాజిల్లాలో 216 కేసులు ఉన్నట్లు నమోదయ్యాయి. అదే విధంగా కరోనాతో ఇప్పటి వరకూ 33 మంది మరణించారు. ఆ వివరాలను చూసినట్లైతే.. అనంతపురం జిల్లాలో 4, కృష్ణా జిల్లాలో 8,గుంటూరులో 8, కర్నూల్ లో 10, నెల్లూరులో 3 చనిపోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa