ట్రెండింగ్
Epaper    English    தமிழ்

1995లోనే రూ.1200 కోట్ల స్కామ్ ఇదే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 03, 2020, 05:09 PM

ఇన్నేళ్ల భారత చరిత్ర లో జరిగిన కుంభకోణాల చిట్టా తీస్తే షాక్ కు గురి కావాల్సిందే. దేశంలో ఏ ప్రభుత్వం పాలనలో ఉన్నా కుంభకోణాలు మాత్రం ఆగడం లేదు. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలోనే ఆర్మీ వాహనాల కొనుగోలులో ముడుపులు స్వీకరించినట్లు అప్పటి ప్రధాని నెహ్రూపై ఆరోపణలు వచ్చాయి. అయితే కాలం గడిచే కొద్ది కంభకోణాలకు పాల్పడే విధానాలు, అనుసరిస్తున్న పద్ధతులు, కాజేస్తున్న మొత్తం అన్నీ మారిపోయాయి. ఇరవై ముప్పై కోట్ల నుంచి ప్రారంభమైన కుంభకోణాల పరంపర ఇప్పుడు లక్షల కోట్లకు చేరింది. వ్యవస్థలోని లోపాలే మోసగాళ్లకు పెట్టుబడులు అవుతున్నాయి. ప్రభుత్వంలోని పెద్దల సాయంతో సమాజంలో పెద్దమనుషులుగా చలామణి అవుతున్న మాయగాళ్లు చేసిన కుంభకోణాలు అన్నీ ఇన్నీ కావు. అటువంటి కుంభకోణాలలో ఇప్పుడు ఓ భారీ ఆర్థిక కుంభకోణం గురించి తెలుసుకుందాం.నకిలీ కంపెనీలతో యథేచ్చగా సాగించిన కుంభకోణమే.. ఈ సి.ఆర్.బన్సాలీ కుంభకోణం. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా నగదు సేకరించి నకిలీ కంపెనీల్లో పెట్టుబడి పెట్టినట్లు చూపిస్తూ సి.ఆర్.బన్సాలీ 1995లోనే 1200 కోట్ల కుంభకోణానికి బీజం వేశారు. 1993 నుంచి 1996 వరకు మూడేళ్ల కాలంగా ఏకంగా 133 నకీలీ కంపెనీలనే సృష్టించాడు. ఈ తతంగాన్ని సెక్యూరిటీ ఎక్జేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా పసిగట్టే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa