ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ స్కూళ్లకు అప్పటి వరకు సెలవులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 02, 2020, 04:53 PM

ఏపీలోని స్కూళ్లకు జూన్ 11 వరకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. స్కూళ్లు తెరిచే అంశానికి సంబంధించి తర్వాత ప్రకటన చేస్తామని విద్యాశాఖ తెలిపింది. దీనికి సంబంధించి కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా ప్రభావంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. మే 17 వరకు లాక్ డౌన్ పెంచుతూ కేంద్ర సర్కార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.ఇప్పటికే ఏపీలో 1 నుంచి 9 వ తరగతుల వరకు విద్యార్దులను పై తరగతులకు ప్రమోట్ చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షలకు సంబంధించి త్వరలోనే షెడ్యూల్ ప్రకటిస్తామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఇచ్చిన ఆదేశాల ప్రకారం జూన్ 11 వరకు సెలవులు కొనసాగనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa