లాక్ డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో చిక్కుకున్న వలస కార్మికులు, విద్యార్దులు,యాత్రికల తరలింపులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్ర ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అవి ఇలా ఉన్నాయి.
- రాష్ట్రంలోని ఇతర జిల్లాలలో చిక్కుకున్న వలస కార్మికులు 1902 కి ఫోన్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలి.
- కేవలం గ్రీన్ జోన్ నుండి గ్రీన్ జోన్ లకు మాత్రమే అనుమతి.
- రిలీఫ్ క్యాంప్ లో నుండి స్వగ్రామాలకు వెళ్లాలి అనుకునే వాళ్ళకు ర్యాండమ్ గా పరీక్షలు.
- కోవిడ్ పరీక్షల్లో నెగటివ్ వస్తే వారిని బస్సులలో 50 శాతంకు మించకుండా తరలించాలి.
-స్వగ్రామాల్లో సైతం మరోసారి 14 రోజుల క్వారంటైన్, అనంతరం మరో 14 రోజులు హోం క్వారంటైన్.
-ఎవరికైనా పాజిటివ్ వచ్చినట్టు గుర్తిస్తే ఆ గ్రూపు మొత్తాన్ని అక్కడే ఉంచాల్సిందిగా సూచించిన ప్రభుత్వం.
-పాజిటివ్ వచ్చిన వ్యక్తిని వెంటనే ఆసుపత్రి తీసుకెళ్లాలని ఆదేశం.
- ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారి గురించి ఆ రాష్ట్రాల అధికారులతో సమన్వయం చేసుకోవాల్సిందిగా ఆదేశాలు.
- ప్రతి జిల్లాలో ఒక బస్టాండ్, రైల్వే స్టేషన్ గుర్తించాలని ఆదేశం.
- ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు ఆ జిల్లా యంత్రాంగం అనుమతి ఇచ్చిన రైల్వే స్టేషన్, బస్టాండ్ చేరుకునేందుకు ఏర్పాట్లు.
- వచ్చిన వారికి స్క్రీనింగ్ తో సహా,ఫూల్ పద్ధతిలో కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశం.
- ఇతర రాష్ట్రాల్లో రెడ్ జోన్, కంటెన్మెంట్ జోన్ నుండి వచ్చే వారిని ప్రత్యేకంగా గుర్తించాలని సూచించిన ప్రభుత్వం.
- ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని వెంటనే 14 రోజుల క్వారంటెన్ కు పంపి పరీక్షల అనంతరం బయటకు వెళ్లేందుకు అనుమతి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa