ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వలస కార్మికుల తరలింపు మార్గదర్శకాలు జారీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 02, 2020, 12:11 PM

లాక్ డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో చిక్కుకున్న వలస కార్మికులు, విద్యార్దులు,యాత్రికల తరలింపులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్ర ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అవి ఇలా ఉన్నాయి.


- రాష్ట్రంలోని ఇతర జిల్లాలలో చిక్కుకున్న వలస కార్మికులు 1902 కి ఫోన్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలి.


- కేవలం గ్రీన్ జోన్ నుండి గ్రీన్ జోన్ లకు మాత్రమే అనుమతి.


- రిలీఫ్ క్యాంప్ లో నుండి స్వగ్రామాలకు వెళ్లాలి అనుకునే వాళ్ళకు ర్యాండమ్ గా పరీక్షలు.


- కోవిడ్ పరీక్షల్లో నెగటివ్ వస్తే వారిని బస్సులలో 50 శాతంకు మించకుండా తరలించాలి.


-స్వగ్రామాల్లో సైతం మరోసారి 14 రోజుల క్వారంటైన్, అనంతరం మరో 14 రోజులు హోం క్వారంటైన్.


-ఎవరికైనా పాజిటివ్ వచ్చినట్టు గుర్తిస్తే ఆ గ్రూపు మొత్తాన్ని అక్కడే ఉంచాల్సిందిగా సూచించిన ప్రభుత్వం.


-పాజిటివ్ వచ్చిన వ్యక్తిని వెంటనే ఆసుపత్రి తీసుకెళ్లాలని ఆదేశం.


- ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారి గురించి ఆ రాష్ట్రాల అధికారులతో సమన్వయం చేసుకోవాల్సిందిగా ఆదేశాలు.


- ప్రతి జిల్లాలో ఒక బస్టాండ్, రైల్వే స్టేషన్ గుర్తించాలని ఆదేశం.


- ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు ఆ జిల్లా యంత్రాంగం అనుమతి ఇచ్చిన రైల్వే స్టేషన్, బస్టాండ్ చేరుకునేందుకు ఏర్పాట్లు.


- వచ్చిన వారికి స్క్రీనింగ్ తో సహా,ఫూల్ పద్ధతిలో కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశం.


- ఇతర రాష్ట్రాల్లో రెడ్ జోన్, కంటెన్మెంట్ జోన్ నుండి వచ్చే వారిని ప్రత్యేకంగా గుర్తించాలని సూచించిన ప్రభుత్వం.


- ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని వెంటనే 14 రోజుల క్వారంటెన్ కు పంపి పరీక్షల అనంతరం బయటకు వెళ్లేందుకు అనుమతి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa