- ఎమర్జన్సీ వీరులను భవిష్యత్ తరాలు స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి మంత్రి
-పైడికొండల మాణిక్యాలరావు ఎమర్జన్సీని రెండో స్వాతం్త్ర్యంగా గుర్తించాలి : తెలంగాణ హోంశాఖ మంత్రి నాయని నర్సింహారెడ్డి
విజయవాడ, సూర్య బ్యూరో : ఎమర్జన్సీ వీరులను భవిష్యత్ తరాలు స్ఫూర్తి దాయకంగా తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట దేవాదాయ శాఖమంత్రి పైడి కొండల మాణిక్యాలరావు సూచించారు. భారత సురక్షా సమితి దక్షిణ భారత సదస్సు ఆధ్వర్యంలో `1975 ఎమర్జన్సీ హీరోలు' అనే అంశంపై సదస్సు నగర ంలో ఆదివారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న మాణ ిక్యాలరావు మాట్లాడుతూ, స్వాతం్త్ర్యం కోసం నాడు చేసిన పోరాటానికి ఏమా్త్రం తీసిపోని విధంగా 1975 నాటి ఎమర్జన్సీ పోరాటం జరిగిందన్నారు. నాటి స్వాతం్త్ర్య పోరాటం బ్రిటిషర్లకు వ్యతిరేకంగా జరిగితే స్వేచ్ఛ కోసం ఇందికాగాంధీ విధించిన ఎమర్జన్సీకి వ్యతిరేకంగా 1975 పోరాటం జరిగిందన్నారు. నాటి వీరుల వీరగాధలు భవిష్యత్ తరాలకు తెలియాల్సి వుందని, అందుకోసం పాఠ్య పుస్తకాల్లో పొందుపరచాలని అన్నారు. ఎమర్జనీ పోరాట యోధుల అభ్యర్థలను కేంద్ర మంు్తల్రకు వివరిస్తామని హామీ ఇచ్చారు. అ సమావేశానికి విచ్చేసిన మరో ముఖ్యఅతిధి తెలంగాణ రాష్ర్ట హోం శాఖ మంత్రి నాయని నర్సింహారెడ్డి మాట్లాడుతూ, దేశంలో 1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జన్సీని రెండో స్వాతం్త్ర్యంగా గుర్తించి స్వేచ్ఛ కోసం పోరాడిన యోధులను సముచిత రీతిన ప్రభుత్వం గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల ప్రచారంలో చేసిన తప్పిందంవల్ల ఓటమి పాలైన ఇందిరాగాంధీ ఎమర్జన్సీ విధించిందన్నారు. దాంతో అందరి పౌరహక్కులు హరించబడ్డాయని, ప్రజలంతా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారన్నారు. ప్రజాస్వామ్య వాదులంతా స్వేచ్ఛ కోసం పో రాటం చేయడంతో వారిని అరెస్టులు చేసి జైళ్లలో వేశారన్నారు. తను కూడా ఈ పోరాటంలో పాల్గొని 18 నెలల పాటు జైలు శిక్ష అనుభవించానన్నారు. ఎమ ర్జన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసి జైలు పాలైన వ్యక్తుల కుటుంబాలు కొన్ని విచ్ఛిన్నమైపోయాయని, ఉద్యోగాలు పోయి దయనీయ స్థితిల్లో ఉన్నాయన్నారు ఎమర్జన్సీ కూడా రెండో స్వాతం్త్ర్యం వంటిదని, అందువల్ల ఈ పోరాటంలో పాలొ ్గన్న వారిని కూడా స్వాతం్త్ర్య సమరయోధులుగా గుర్తించి వారికి స్వాతం్త్ర్య సమర యోధులకు వర్తించే అన్ని సౌకర్యాలు, పింఛన్ అందచేయాలని అన్నారు. ఇందుకు తాను కేంద్ర హోంమంత్రికి, ప్రధానికి లేఖలు రాస్తానన్నారు. మాజీ ఎంపీ యలమంచలి శివాజీ మాట్లాడుతూ, పార్లమెంటు జరిగే సమయంలో ఆంధ్ర, తెలంగాణల నుంచి రెండు రైళ్లలో ఎమర్జన్సీలో పాల్గొన్న వారంతా వెళ్లి అక్కడ సదస్సు నిర్వహించి ప్రధానిని దానికి ఆహ్వానించి తమ డిమాండ్లు తెలియచేయాలన్నారు. తాను ఎమర్జన్సీలో జైళ్లలో గడిపిన రోజులు గుర్తు చేసు కున్నారు. సభాధ్యక్షులుగా భారత సురక్షా సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు వామ రాజు సత్యమూర్తి వ్యవహరించగా, తెలంగాణ శాఖ అధ్యక్షులు అశోక్ కుమార్ యాదవ్, తమిళనాడు శాఖ అధ్యక్షులు నందకుమార్, అస్సాం శాఖ అధ్యక్షులు గోవర్ధన్ప్రసాదు తదితరులు ప్రసంగించారు. ఉత్తరభారత్లోని పలు రాష్ట్రాల్లో ఎమర్జన్సీ పోరాట యోధులకు పింఛన్లు ఇస్తున్నారని దీనిని ఏకీకృతం చేసి దేశం మొత్తం ఒకేలా పింఛన్ సదుపాయం కలుగచేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ సమద్సు తీర్మానించింది. కార్యక్రమాన్ని సమితి రాష్ర్ట ప్రధాన కార్యదర్శి వలవల బాజ్జి, ఉపాధ్యక్షులు భవాని శంకర్, కోశాధికారి టి.వి.సత్యనారాయణ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉభయరాష్ట్రాల నుంచి వచ్చిన పలువురు పోరాట యోధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.