ఏపీలో పదో తరగతి పరీక్షలకు సంబంధించి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు. మే 3తో లాక్ డౌన్ ముగుస్తుందని, లాక్ డౌన్ ముగిసిన తర్వాత 2 వారాల్లో పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. లాక్ డౌన్ పూర్తయ్యాక పరిస్థితులను సమీక్షించి పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేస్తామన్నారు. భౌతిక దూరం పాటిస్తూనే పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తామన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో పరీక్షలు జరిగే వరకు ఆన్లైన్లో సప్తగిరి ఛానల్ ద్వారా పాఠాలు వినాలని విద్యార్థులకు మంత్రి సూచించారు. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులను ఎలాంటి పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేస్తూ ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షలు మాత్రం నిర్వహించి తీరుతామని గతంలోనే స్పష్టం చేసింది. ప్రస్తుతం మంత్రి వ్యాఖ్యలను బట్టి చూస్తే మే 15 తర్వాత ఏపీలో పదో తరగతి పరీక్షలు జరగడం ఖాయమని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa