ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉచిత రేషన్ పంపిణీ మార్గదర్శకాలివి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 29, 2020, 08:12 AM

కరోనా వైరస్ ప్రభావంతో ఏపీలో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కరోనా సాయం కింద ఏపీలో నేటి నుంచి మూడో విడత రేషన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. రేషన్ పంపిణీకి సంబంధించి సర్కార్ పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
- బియ్యం కార్డు దారులకు ఏప్రిల్ 29 నుంచి మే 10 వరకు రేషన్ షాపుల ద్వారా ఉచిత సరుకుల పంపిణీ ఉంటుంది.
-కరోనా నిబంధనలను పాటిస్తూ భౌతికదూరం పాటిస్తూ రేషన్ సరుకుల్ని జాగ్రత్తగా తీసుకోవాలి.
-టైం స్లాట్ టోకెన్‌లు ఇస్తారు. సీరియల్ ప్రకారం వచ్చి రేషన్ సరుకులు తీసుకోవాలి. ఒక్కో రేషన్ షాపులో రోజుకు 30 మందికి సరుకులు పంపిణీ చేస్తారు.
- మొదటి, రెండు విడతల్లో వీఆర్వో లేదా ఇతర అధికారుల బయో మెట్రిక్ ద్వారానే రేషన్ అందించారు.
- మూడో విడతలో మాత్రం లబ్దిదారుల సొంత బయోమెట్రిక్ తప్పనిసరి అవుతోంది.
- కరోనా జాగ్రత్తల్లో భాగంగా అన్ని రేషన్ షాపుల దగ్గర శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉంటున్నాయి.
- ప్రతి లబ్దిదారుడు బయోమెట్రిక్ ఉపయోగించే ముందు శానిటైజర్‌ని చేతిలో వేసుకొని అది ఆరిపోక ముందే రెండు చేతులకూ రాసేసుకోవాలి. అలా రాసుకునేలా రేషన్ డీలర్లు జాగ్రత్తలు తీసుకోవాలి.
- డీలర్ తప్పనిసరిగా షాపులో శానిటైజర్ ఉంచుతారు. ఉంచకపోతే లబ్దిదారులు ఆ డీలర్‌ను నిలదీయవచ్చు. మొత్తం పంపిణీని ఆపేసి పోలీసులకు కంప్లైంట్ కూడా ఇవ్వొచ్చు.
-బయోమెట్రిక్ విధానం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa