లాక్డౌన్ వల్ల అన్ని ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ వాయిదా పడటంతో అప్లికేషన్లు భారీగా తగ్గాయి. ఎంసెట్, ఈసెట్, పీజీఈసెట్, ఎడ్సెట్, పీఈసెట్, లాసెట్తో పాటు మిగిలిన ప్రవేశ పరీక్షలకు గతేడాది కంటే తక్కువ దరఖాస్తులే వచ్చాయి. ముఖ్యంగా ఎంసెట్ కు (ఇంజినీరింగ్, అగ్రికల్చర్) గతేడాది 2,17,799 అప్లికేషన్లొస్తే, ఈసారి ఇప్పటి వరకూ 1,90,141 దరఖాస్తులే వచ్చాయి. ఇంజినీరింగ్విభాగంలో గతేడాది 1,42,210 అప్లికేషన్లు రాగా, ఈసారి 1,23,377, అగ్రికల్చర్, ఫార్మసీలో గతేడాది 74,989 దరఖాస్తులు వస్తే, ఈసారి 66,764 వచ్చాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa