ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకునట్టు తెలుస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని జూన్ 30 వరకు మూసివేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. దీనికి సంబంధించి టీటీడీ పాలకమండలితో ప్రభుత్వ పెద్దలు నేడు చర్చలు జరిపారు. ఆలయాన్ని ఓపెన్ చేస్తే కరోనా వైరస్ ప్రబలే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో జూన్ 30 వరకు తిరుమల ఆలయాన్ని తెరువవద్దని నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. జూన్ 30 వరకు తిరుమల ఆలయంలో భక్తులకు దర్శనం ఉండదు. జూలై 1 తర్వాత భక్తులకు దర్శనానికి అనుమతి ఇచ్చేది లేనిది తర్వాత ప్రకటిస్తామని టీటీడీకి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. జూన్ 30 వరకూ ఆలయంలోకి, ఘాట్ రోడ్లపైనా భక్తులకు అనుమతి ఉండదని సమాచారం. రోజూ స్వామి వారికి పూజలు, కైంకర్యాలూ మాత్రం కొనసాగుతాయి. జూలై 1 తర్వాత కూడా పరిస్థితిని బట్టి దశల వారీగా అనుమతులు ఇవ్వాలని అధికారులు నిర్ణయించినట్టు సమాచారం. శుక్రవారం టీటీడీ పాలకమండలి బోర్డు భేటి కానుంది. ఆ రోజు అధికారికంగా దీని పై ప్రకటన చేయనున్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa