ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షుగర్ పేషెంట్స్ తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలివే...

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 23, 2020, 05:58 PM

మధుమేహం.. ఈ తీపి రోగం.. ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగులుస్తుంది. అనేక కారణాల వల్ల త్వరగా శరీరంలోకి ప్రవేశించి ప్రజలను రోజురోజుకి బలహీనులుగా మార్చడం దీని ప్రత్యేకత ఇలాంటి డేంజర్ సమస్య రావొద్దని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముందునుంచి జాగ్రత్త పడతారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కరోనా విజృంభణ టైమ్‌లో కరోనా నుంచి తప్పించుకోవాలంటే ఎలా.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మామూలుగా డయాబెటీస్‌కి ఇన్ఫెక్షన్స్ త్వరగా సోకుతాయి. అందుకే అలాంటి సమస్య రాకుండా ఉండాలంటే.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.అనేక కారణాల వల్ల మధుమేహం మనదేహంపై దాడిచేస్తుంది. ఎక్కువ శారీరక శ్రమ లేకపోవడం, సరైన జీవనవిధానం లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం ఇలాంటి అనేక కారణాలు అన్ని కూడా మధుమేహంకి కారణంగా మారుతుంది. ఇలాంటి నేపథ్యంలో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఓసారి మన శరీరంలోకి వచ్చిందంటే చాలు.. ఇతర ఇన్ఫెక్షన్స్ కూడా ఈజీగా సోకుతాయి. మరి ఇప్పుడు కరోనా రోజురోజుకి తన ప్రతాపం చూపుతున్న నేపథ్యంలో మరింత జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు. పోషకాహారం తీసుకుంటూ.. స్వల్ప వ్యాయమాలు కూడా చేయడం మంచిదందంటున్నారు.షుగర్ వ్యాధిగ్రస్తులు ముందుగా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలి. మంచి ఆహారం తీసుకోవాలి. అన్ని పోషకాలు అందే సంపూర్ణ, సమతులాహారం తీసుకోవాలి. రోజుకు మూడు పూటల కాకుండా.. తక్కువ పరిమాణాల్లో ఎక్కువ పరిమాణంలో ఎక్కువ సార్లు తీసుకోవాలి. ఎక్కువగా తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. కాఫీ, పసుపు, వెల్లుల్లి, గుడ్లు, తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఇలాంటి డైట్‌ని పాటిస్తే మంచిది. ఆకుకూరల్లో ఎక్కువగా మెంతికూర తీసుకుంటుండాలి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండే పదార్థాలను ఆహారంగా తీసుకోవాలి. గోధుమలు, చిరుధాన్యాలు తీసుకోవాలి. చేపలు, చికె్ తినొచ్చు. అయితే, మాంసాహారం తినే ముందు వాటిని పూర్తిగా ఉడకనివ్వడం చాలా అవసరం. అలాంటి ఆహారమే తీసుకోవాలి. నీటిని ఎక్కువగా తాగుతుండాలి.అదే విధంగా.. కచ్చితంగా వ్యాయామం చేస్తుండాలి. ఇంట్లోనే అటు ఇటూ నడుస్తుండడం చేయాలి. యోగా, క్రంచెస్, పుషప్స్ ఇలా మీకు ఏది తెలిస్తే ఆ ఎక్సర్‌సైజ్ చేయాలి. దీంతో పాటు డ్యాన్స్ చేయడం, ఏరోబిక్స్ చేస్తుండాలి. అయితే, కేవలం ఎక్సర్‌సైజ్ చేస్తే మాత్రమే కాదు.. ఇంట్లోని కొన్ని పనుల ద్వారా కూడా వ్యాయామం చేసినట్లుగా ఉంటుంది. ఇంటిని క్లీన్ చేస్తుండాలి. తోటపని, గదులని క్లీన్ చేస్తుండాలి.ఏ ఆహారం మంచిదో.. ఏ ఆహారం మంచిది కాదో ముందుగా తెలుసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్, ఇన్‌స్టంట్ ఫుడ్‌ని తగ్గించాలి. వేపుళ్లకి దూరంగా ఉండాలి. కూల్ డ్రింక్స్ జోలికి వెళ్లకపోవడమే మంచిది. చక్కెరని తగ్గించాలి. ఇంట్లో చేసిన పండ్ల రసాలను తాగడం మంచిది. రోజూ ఉదయాన్నే రాత్రి నానబెట్టిన మెంతుల నీళ్ళని తీసుకోవడం వంటివి చేస్తుండండి. బేకరీ ఫుడ్స్, స్వీట్స్ తగ్గించాలి. మరీ అంతగా స్వీట్స్ తినాలనిపిస్తే ఇంట్లో చేసినవి మాత్రమే తక్కువ పంచదార ఉన్న స్వీట్స్ మాత్రమే తీసుకోవడం మంచిది. కొంతమందని చాలా రోజులు పస్తులు ఉండి.. ఒక్కరోజే కదా అని ఇష్టంగా ఫుడ్ తీసుకుంటారు. దీని వల్ల అప్పటివరకూ పాటించిన డైట్ మొత్తం నీరుగారిపోతుంది. కాబట్టి కంట్రోల్‌ చేసుకోవడం చాలా ముఖ్యం.అయితే, వీటన్నింటిని పాటిస్తూ శుభ్రత మెయింటెయిన్ చేయడం చాలా ముఖ్యం. ఎప్పటికప్పుడు చేతులని కడుక్కోవడం చేస్తుండాలి. సామాజిక దూరం పాటించాలి. బయటికి వెళ్లకపోవడమే మంచిది. శుభ్రంగా ఉండడం వల్ల చాలా సమస్యలు దూరం అవుతాయి. కాబట్టి శుభ్రత మెయింటెయిన్ చేయండి. అనేక సమస్యలకు దూరంగా ఉండండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa