వలస కూలీలకు మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఏపీ సర్కార్ కు హైకోర్టు 24 గంటల గడువును విధించింది. లాక్ డౌన్ వల్ల వలస కూలీల పరిస్థితి దారుణంగా ఉందని, వారికి తినడానికి తిండి, ఉండడానికి షెల్టర్ లేదని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని అత్యవసర కేసుగా భావించి హైకోర్టు విచారణ చేసింది. ఏపీలో అసలు వలస కూలీలు ఎంత మంది ఉన్నారో గుర్తించి వారికి 24 గంటల్లో మౌలిక వసతులు కల్పించాలని ఏపీ హైకోర్టు సర్కార్ ను ఆదేశించింది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో కోట్లాది మంది వలస కార్మికులు రోడ్డున పడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారిని కనీసం మనుషుల మాదిరిగా చూడడం లేదని రామకృష్ణ ఆరోపించారు. డౌన్ విధించే సమయంలో కనీసం వలస కార్మికులకు సౌకర్యాలు ఉన్నాయా? లేవా? వారు బతుకుతారా? లేదా? అనే విషయాలను కూడా పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. అనేక మంది వారి స్వస్థలాలకు బయల్దేరి ప్రాణాలను కూడా విడిచారని, వారందరిని ఆదుకోవాలని ఆయన కోరారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa