ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫ్రిజ్‌లో పెట్టిన అరటిపండ్లు తినొచ్చా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 23, 2020, 10:43 AM

అరటి పండ్లు.. అందరికీ అతి తక్కువ ధరలో అందుబాటులో ఉండే ఈ పండులో పోషకాలు ఎన్నో ఉంటాయి. వీటిని ప్రతి ఒక్కరూ తినొచ్చు. ప్రతి ఒక్కరికీ సులభంగా లభించే ఈ పండ్లల్లో ఎన్నో ఘనమైన విటమిన్లు ఉంటాయి. అయితే, మనం పండ్లని ఫ్రిజ్‌లో పెడతాం. ఎందుకంటే చాలా రోజుల వరకూ తాజాగా ఉంటాయని. అయితే ఫ్రిజ్‌లో పెట్టిన అరటిపండ్లని తినొచ్చా లేదా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యాన్నిచ్చే అరటిపండ్లు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటాయి. వీటిని తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతారు. అరటిపండులో విటమిన్స్, మినరల్స్, ఫైబర్, పొటాషియం ఇలా ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల చాలా వరకూ ఎన్నో సమస్యలు దూరం అవుతాయి. అరటిపండ్లు రెగ్యులర్‌గా తినడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులోని ప్రత్యేక గుణాల, చక్కెర శాతం ఉండడం వల్ల మనకు రోజంతా ఎనర్జీని ఇస్తాయని చెబుతారు నిపుణులు. అయితే అరటి పండ్లని ఫ్రిజ్‌లో పెట్టకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఈ పండ్లు మగ్గడానికి పొడి వాతావరణం అవసరం. అందుకని వాటిని ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకూడదు. అంతేకాదు, ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల పండ్లు సరిగా పండవు. అంతేనా పైతొక్కు నల్లగా మారిమారిపోయి పండు రుచి తగ్గిపోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa