ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో 56 కొత్త కరోనా కేసులు నమోదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 22, 2020, 12:50 PM

ఏపీ కరోనా హెల్త్ బులెటిన్ విడుదలైంది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 56 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 813కు చేరుకుంది. కరోనాతో ఇప్పటి వరకు ఏపీలో 24 మంది మరణించారు. 120 మంది కోలుకోని డిశ్చార్జు అయ్యారు. ఇప్పటి వరకు జిల్లాల వారీగా నమోదైన కరోనా వైరస్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపూర్ 36, చిత్తూరు 59, తూర్పుగోదావరి 26, గుంటూరు 177,కడప 51, కృష్ణా 86, కర్నూలు 203, నెల్లూరు 67,ప్రకాశం 48, విశాఖ పట్నం 21, పశ్చిమ గోదావరి 39,విజయనగరం,శ్రీకాకుళంలో 0 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా డిశ్చార్జి అయిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం 7, చిత్తూరు 4, తూర్పుగోదావరి 18, గుంటూరు 23, కడప 23, కృష్ణా 16, కర్నూలు 4, నెల్లూరు 6, ప్రకాశం 1, విశాఖపట్నం 19, పశ్చిమగోదావరి 30 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 120కు చేరింది. అదే విధంగా కరోనాతో అనంతపూర్ లో 3, కృష్ణా జిల్లాలో 6,గుంటూరులో 8, కర్నూల్ లో 5, నెల్లూరులో 2 చనిపోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 24 మంది కరోనాతో చనిపోయారు. ఏపీలో మొత్తం 813 పాజిటివ్ కేసులు నమోదు కాగా 120 మంది డిశ్చార్జ్ అయ్యారు. 24 మంది మరణించారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 669 ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa