ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కస్టమర్లకు జియోఫైబర్ బంపర్ ఆఫర్...

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 21, 2020, 05:50 PM

మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? ప్రస్తుతం మీ ఇంటర్నెట్ డేటా సరిపోవట్లేదా? మీకు రిలయెన్స్ జియో ఫైబర్ కనెక్షన్ ఉందా? జియోఫైబర్ కాంబో ప్లాన్ ప్రకటించింది. రూ.199 కాంబో ప్లాన్ రీఛార్జ్ చేస్తే ఏకంగా 1000 జీబీ డేటా పొందొచ్చు. రూ.199 ప్లాన్ జీఎస్‌టీతో కలిపి రూ.234 చెల్లించాల్సి ఉంటుంది. కొత్త జియో ఫైబర్ కస్టమర్లతో పాటు పాత కస్టమర్లు కూడా ఈ ప్లాన్ వాడుకోవచ్చు. ఇక రూ.199 ప్లాన్ బెనిఫిట్స్ చూస్తే వేలిడిటీ 7 రోజులు. 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 1000 జీబీ వాడుకోవచ్చు. ఆ తర్వాత డేటా స్పీడ్ 1 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది. ఉచిత వాయిస్ కాల్స్ బెనిఫిట్స్ కూడా వాడుకోవచ్చు. మై జియో యాప్స్‌కు యాక్సెస్, ఉచిత ఎస్ఎంఎస్ లాంటి బెనిఫిట్స్ మాత్రం లేవు.దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను దృష్టిలో పెట్టుకొని యూజర్ల కోసం రిలయెన్స్ జియో అనేక ఆఫర్లను ప్రకటిస్తోంది. ఉచితంగా రిలయెన్స్ జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ 10ఎంబీపీఎస్ ప్లాన్‌ను ప్రకటించింది. దీంతో పాటు జియో కొత్త ప్లాన్స్‌ని తీసుకొచ్చింది. అంతేకాదు... జియో యూజర్లు ఏటీఎం ద్వారా రీఛార్జ్ చేసే అవకాశాన్ని కల్పించింది. స్మార్ట్‌ఫోన్ యూజర్లకు మాత్రమే కాదు... ఫీచర్ ఫోన్స్ వాడేవారికి కూడా జియో ప్రత్యేక ఆఫర్స్ ప్రకటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa