ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జగన్ నిరుద్యోగులకు శుభవార్త…?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 21, 2020, 02:57 PM

మహమ్మారి కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న తరుణంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా మరొక నిర్ణయాన్ని తీసుకున్నారు. కాగా రాష్ట్రంలోని నిరుద్యోగులందరికి కూడా అండగా ఉండేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని ప్రకటించారు. కాగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సుమారు 10,700 గ్రామ/ వార్డు వాలంటీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. అయితే ఈ నోటిఫికేషన్ లో వార్డు వాలంటీర్ పోస్టులు 5,500 ఉన్నాయి. అందులో వాలంటీర్ ఉద్యోగానికి కనీస అర్హత పదో తరగతిగా నిర్దేశిస్తూ, 2020 జనవరి 1 నాటికీ 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు నిర్దారించారు.కాగా ఈ ఉద్యోగానికి సంబంధించిన దరఖాస్తు కి ఏప్రిల్ 24 చివరి తేదీ అని, ఏప్రిల్ 25న పరిశీలన ప్రక్రియ పూర్తి చేసి, ఏప్రిల్ 27-29 మధ్య ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని అధికారికంగా వెల్లడించారు. అర్హత సాధించిన వారందరికీ కూడా మే 1న నియామక ఉత్తర్వులు అందజేస్తారు. అయితే ఈ పోస్టులకు మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. కాగా ఇంటర్వ్యూ 100 మార్కులు, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై అవగాహనకు సంబంధించి 25 మార్కులు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమల్లో భాగస్వామ్యం, సేవా సంస్థల్లో పనిచేసిన అనుభవం, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లయితే 25, నాయకత్వ లక్షణాలు, భావ వ్యక్తీకరణకు 25, ఇతర నైపుణ్యాలకు 25 మార్కులు కేటాయిస్తూ ఉద్యోగాలు కేటాయించనున్నారు.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa