ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహమ్మారి కరోనా దారుణంగా విస్తరిస్తున్న తరుణంలో చిల్లర రాజకీయాలు మానుకోవాలని విపక్ష నేతలను మంత్రి మోపిదేవి వెంకటరమణ హెచ్చరించారు. ఓ వైపు కరోనా మహమ్మారితో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. సున్నితమైన సమయంలో అసత్యపు ఆరోపణలు చేయడం తగదన్నారు. రాజధాని తరలింపు, స్థానిక ఎన్నికల నిర్వహణపై సమయం వచ్చినప్పుడు మాట్లాడతామని తెలిపారు. నిర్మాణత్మకమైన సలహాలిస్తే స్వాగతిస్తాం తప్ప చిల్లర మాటలు మాట్లాడితే.. ఉరుకోబోమని స్పష్టం చేశారు. కర్నూలు, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో మినహా మిగతా జిల్లాల్లో కేసులు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. గుంటూరులో ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా జీజీహెచ్లో 500 పడకలతో కొవిడ్ ఆస్పత్రిని సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. కరోనాను నియంత్రించేందుకు ప్రజలందరూ మే మూడో తేదీ వరకు ఇళ్లలోనే ఉండాలని మంత్రి కోరారు. కరోనా నియంత్రణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసించిన సంగతిని మంత్రి గుర్తుచేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa