ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంటూరు జిల్లాలో పొరపాట్లు కరోనా కలకలం..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 20, 2020, 01:02 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది అయితే రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు. గుంటూరు జిల్లాలో జరిగిందీ ఘటన... స్థానిక కాటూరి మెడికల్ కాలేజీ క్వారంటైన్ సంటర్‌లో ఇద్దరు అనుమానితుల్ని వేర్వేరుగా ఉంచారు. ఇద్దరి పేర్లూ ఒకటే. ఇద్దరికీ ఒకే సమయంలో కరోనా శాంపిల్స్ టెస్ట్ చేశారు. ఇద్దరిలో ఒకరికి నెగెటివ్ వచ్చింది. దాంతో... సిబ్బంది క్వారంటైన్ కేంద్రానికి వచ్చి... మీకు నెగెటివ్ వచ్చింది... కాబట్టి... మీరు వెళ్లవచ్చు. అంటూ రాత్రి వేళ నెగెటివ్ రిపోర్ట్ ఇచ్చి... రూ.2000 ఇచ్చి... తాడేపల్లికి చెందిన వ్యక్తిని డిశ్చార్జి చేశారు. ఆల్రెడీ ఆస్తమించిన సూర్యుడు... తెల్లారుతుండగా... ఉదయించాడు.మార్నింగ్ డాక్టర్లు మరో వ్యక్తి సంగతేంటని గమనిస్తుంటే... షాకింగ్ విషయం తెలిసింది. రాత్రి డిశ్చార్జి అయిన వ్యక్తికే కరోనా ఉందనీ... పొరపాటును వేరే వ్యక్తికి ఇవ్వాల్సిన రిపోర్టును అతనికి ఇచ్చేశారని అర్థమైంది. అప్పటికప్పుడే అధికారులు... పరుగున వచ్చి... రాత్రి డిశ్చార్జి అయిన వ్యక్తిని... మీకు రాంగ్ రిపోర్ట్ వచ్చింది, వేరే వాళ్లకు ఇవ్వాల్సిన రిపోర్ట్ మీకు ఇచ్చేశారు... అని చెబితే... అతను ఫుల్లుగా ఫైర్ అయ్యాడు. రాత్రంతా తాను తన ఇంట్లో వాళ్లతో ఉన్నాననీ, ఇప్పుడు వాళ్లకు కరోనా వస్తే... ఏంటి పరిస్థితి అని ప్రశ్నించాడు.నాకు డాక్టర్లు నెగెటివ్ అని ఇచ్చారు. కాబట్టి నేను రాను అంటూ అతను మొండికేశాడు. పొరపాటు జరిగింది అన్నా... అతను తిరిగి వచ్చేందుకు ఒప్పుకోకపోవడంతో... వైద్య అధికారులు పోలీసులకు కాల్ చేశారు. పోలీసులు వచ్చి... 108 అంబులెన్స్‌లో అతన్ని కరోనా ఐసొలేషన్ వార్డుకి పంపారు. ఇప్పుడు అతనితోపాటూ... అతని భార్య, కూతురు, మరో ఇద్దర్ని కూడా మరో అంబులెన్స్‌లో క్వారంటైన్ కేంద్రానికి పంపి... విడివిడిగా ఉంచారు. ఇలా... టెన్షన్‌లో జరిగిన ఓ పొరపాటు వల్ల... మరో ముగ్గురికి కరోనా సోకే ప్రమాదం కనిపిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa