ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహమ్మారి కరోనా దారుణంగా విస్తరిస్తున్న తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో కీలకమైన నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఏపీ ప్రజలకు జగన్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రోజు నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో లాక్డౌన్ నిబంధనలను సడలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రెడ్ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో ఆంక్షలను సడలించింది. కేంద్ర హోం శాఖ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో మండలాలను రెడ్, ఆరంజ్, గ్రీన్ జోన్లుగా విభజించిన సర్కారు.. రెడ్ జోన్ మండలాలలో మాత్రం ప్రభుత్వం మే నెల 3వ తేదీ వరకు లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయనుంది. అక్కడ ఎటువంటి పారిశ్రామిక కార్యకలాపాలను అనుమతించరు. గ్రీన్ జోన్లలో కఠినమైన నిబంధనలు పాటిస్తూ సంస్థలు కార్యకలాపాలు సాగించాల్సి ఉంటుంది. దీంతో.. వలస కార్మికులకు, నిర్మాణ రంగ కూలీలకు ఊరట కలగనుంది. అటు.. ఫుడ్ ప్రాసెసింగ్, ఇతర కంపెనీలు కార్యకలాపాలు కొనసాగించేలా అనుమతులు ఇచ్చినట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa