ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న మహమ్మారి. వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్కు అడ్డుకట్ట వేయలేక అగ్రరాజ్యాలే గడగడలాడుతున్న వేళ కోవిడ్–19 పాజిటివ్ కేసు నిర్థారణ అయిన వెనువెంటనే స్పందించి, పటిష్ట చర్యలతో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేశారు అధికారులు. ఏపీలో కోవిడ్ 19 నివారణ చర్యలపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష జరిపారు. కేసులు అధికంగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఆదేశించారు. కచ్చితంగా భౌతిక దూరం పాటించేలా నిబంధనలు అమలు చేయాలని జగన్ స్పష్టం చేశారు. వివిధ సెంటర్ల నుంచి క్వారంటైన్ పూర్తిచేసుకున్న వారిని ఇంటికి పంపేటప్పుడు పేదలకు 2 వేల రూపాయలు ఇవ్వాలని చెప్పారు. పౌష్టికాహారం తీసుకునేలా సూచనలు చేయకపోతే.. సమస్య మొదటికి వస్తుందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. హాట్ స్పాట్ల ప్రాంతాల్లో మాస్కులు పంపిణీ చేయాలని సూచించారు జగన్. వ్యవసాయ, మత్స్య ఉత్పత్తులు అమ్ముకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు ముఖ్యమంత్రి. కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలు...రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై సీఎం తెలుసుకున్నారు. రెడ్ జోన్లలో కఠిన చర్యలు తీసుకోవాలని, టెస్టులను క్రమంగా పెంచాలని సూచించిన సీఎం. రెండవ విడత రేషన్ పంపిణి అంశాలపై చర్చించారు. మావేశంలో మంత్రులు ఆళ్ల నాని, బొత్స సత్యనారాయణ, సీఎస్ నీలం సాహ్నితో పాటు డీజీపీ గౌతమ్ సవాంగ్, ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహార్ రెడ్డి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa