కరోనా నివారణ పయత్నాల్లో భాగంగా కేంద్రం ఆరోగ్య సేతు యాప్ ను రూపొందించింది. అయితే ఈ యాప్ ను ఈ-పాస్గా కూడా ఉపయోగించు కోవచ్చునని ప్రధాని మోదీ సూత్రప్రాయంగా పేర్కోన్నారు. ఈ నేపధ్యంలోనే కేంద్రం ఈ యాప్లో మరో రెండు ఫీచర్లను చేర్చింది. వీటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎలక్ట్రానిక్ పాస్(ఈ- పాస్). లాక్ డౌన్ వేళ బయట తిరిగేందుకు వీలుగా కోవిడ్ లక్షణాలు, ఉత్పత్తి స్థానం, మాత్రికలను బట్టి దీనిని రూపొందించారు. ఇందులో గ్రీన్, ఆరెంజ్, రెడ్ రంగులు ఉంటాయి. ఆకుపచ్చ రంగు వస్తే.. సదరు వ్యక్తి బహిరంగ ప్రదేశాల్లో స్వేచ్చగా తిరగొచ్చు. ఇక ఆరెంజ్ కలర్ వస్తే.. ఆ వ్యక్తి ఎవరితోనూ కలవకూడదు. ఓన్లీ ఆఫీస్, ఇంటికి సంబంధించిన కార్యకలాపాల్లోనే పాల్గొనాలి. అంతేకాకుండా సామాజిక దూరాన్ని తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ఇక రెడ్ వస్తే మాత్రం వారు ఎవ్వరిని కలవకూడదు. పూర్తిగా గృహ నిర్భంధంలోనే ఉండాలి. ఇప్పటికే చైనాలో ఈ పద్దతిని విజయవంతంగా అనుసరించగా.. ఇప్పుడు ఇండియాలో కూడా దీన్ని ప్రయత్నించనున్నారు. ఈ-పాస్తో పాటు కొత్తగా చేర్చిన మరో ఫీచర్.. కోవిడ్ అప్డేట్స్.. ప్రపంచం, దేశంలో ఉన్న కరోనా పాజిటివ్ కేసుల వివరాలు, ఏ ఆసుపత్రుల్లో ఏయే సౌకర్యాలున్నాయి, ఒకవేళ కరోనా వస్తే ఎవరిని ఎలా సంప్రదించాలి అని మొదలైనవన్నీ కూడా దీనిలో ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్లు ఆపరేషనలైజ్ కాలేదు. మరికొద్ది రోజుల్లోనే వీటిని ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa