ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ప్రజలకు మరో శుభవార్త

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 17, 2020, 10:46 AM

ఏపీ సర్కార్ కరోనా కట్టడికి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. అదే విధంగా కరోనా సాయం కింద ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఫ్రీ రేషన్, కుటుంబానికి రూ.1000 సాయాన్ని సర్కార్ అందిస్తుంది. మొదటి విడతలో భాగంగా మార్చి 29న సర్కార్ సాయాన్ని అందించింది. ఏప్రిల్ 4న కరోనా సాయం కింద రేషన్ కార్డుదారులకు రూ.1000 అందించారు. రెండో విడతలో భాగంగా మనిషికి 5 కిలోల బియ్యంతో పాటు కిలో శనగలు ఫ్రీగా ఇస్తున్నారు. అదే విధంగా ప్రజలంతా ఒకేసారి షాపు వద్దకు రాకుండా ఉండేందుకు వాలంటీర్లు కూపన్లు ఇచ్చారు. రేషన్ తీసుకోవడంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే 1902 నంబర్ కు కాల్ చేయవచ్చని సర్కార్ తెలిపింది. ఏప్రిల్ 29న మూడో విడతగా మనిషికి 5 కేజీల బియ్యం,కిలో కంది పప్పు ఇవ్వనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa