ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న మహమ్మారి. వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్కు అడ్డుకట్ట వేయలేక అగ్రరాజ్యాలే గడగడలాడుతున్న వేళ కోవిడ్–19 పాజిటివ్ కేసు నిర్థారణ అయిన వెనువెంటనే స్పందించి, పటిష్ట చర్యలతో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేశారు అధికారులు. ఏపీ సీఎం జగన్ తీరుపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సీరియస్ అయ్యారు. నేడు ఓ ప్రకటన విడుదల చేసిన యనమల కేంద్రం ఇచ్చిన కరోనా ఉపశమన నిధులను తొక్కిపెట్టడం సరికాదని నిధులు విడుదల చేయవద్దని ట్రెజరీలకు ఆంక్షలు జారీ చేయడం అమానుషమని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులు, డివల్యూషన్ కింద రావాల్సిన సొమ్ము, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, కోవిడ్ 19 ఉపశమన నిధులు, 14 వ ఆర్ధిక సంఘం నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఏడాది ఫుల్గా ఉన్నాయని అన్నారు.అయితే నిధులు లేక డాక్టర్లు, వైద్యసిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారని ప్రస్తుతం కరోనా కిట్లకు, మాస్కులు, పీపీఈలకు, వైద్యం, పారిశుధ్య పనులకు నిధులు అత్యవసరం ఉన్నా విడుదల చేయకుండా స్థంభింపచేయడాన్ని తప్పుపట్టారు. ప్రజల ప్రాణాపాయ స్థితుల్లో ఉన్న సమయంలో కూడా నిధులు విడుదల చేయవద్దని చెప్పిన ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా అని ప్రశ్నించారు. కోవిడ్ 19కు ‘వైఎస్సార్ కరోనా, జగన్ కరోనా’ అని పేర్లు పెట్టుకోవాలని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa