ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గత కొన్ని గంటల్లో సింగిల్ డిజిట్ కు చేరుకుంది...

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 16, 2020, 01:47 PM

ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న మహమ్మారి. వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్‌కు అడ్డుకట్ట వేయలేక అగ్రరాజ్యాలే గడగడలాడుతున్న వేళ కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసు నిర్థారణ అయిన వెనువెంటనే స్పందించి, పటిష్ట చర్యలతో వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేశారు అధికారులు. ఆంధ్ర రాష్ట్రంలో కరోనా పరమోరా గత కొన్ని రోజుల నుంచి అలా కొనసాగుతూనే వస్తుంది. ఒకటి రెండు రోజులు తగ్గింది అనుకుంటే మళ్ళీ అమాంతం పెరిగింది. కానీ ఇప్పుడు మాత్రం కాస్త ఊరటని ఇస్తుందని చెప్పాలి. గత కొన్ని రోజుల నుంచో ప్రతీ 12 గంటల్లోపలే రెండు డిజిట్ నంబర్స్ లో నమోదు అయ్యే కేసులు కాస్త ఇప్పుడు సింగిల్ డిజిట్ కు చేరుకుంది.నిన్న సాయంత్రం 7 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకు కేవలం 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యినట్టుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వారు తెలియజేసారు. కృష్ణ జిల్లాలో 3, కర్నూల్ జిల్లాలో 3, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో 3 కేసులు ఇలా మొత్తం 9 కేసులు నమోదు అయ్యినట్టుగా తెలిపారు. ఈ మొత్తం 9 కేసులుతో ఏపీలో కరీనా పాజిటివ్ కేసులు సంఖ్య మొత్తం 534 కు చేరుకుంది. వీరందరిలో మొత్తం 20 మంది సంపూర్ణంగా బయటపడి డిశ్చార్జ్ కాగా 14 మంది మరణించారు. అలాగే 500 మంది చికిత్స పొందుతున్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa