కరోనా వైరస్ ప్రభావంతో దేశమంతా లాక్ డౌన్ కొనసాగుతుంది. దీంతో చాలా మందికి తమ దగ్గర్లో ఏ షాపులు తెరిచి ఉన్నాయి. ఏవి లేవు అనే వివరాలు తెలియడం లేదు. నిత్యావసరాలు కొనుగోలుకు సంబంధించి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో పేమెంట్ యాప్ ఫోన్ పే రెండు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఫోన్ పే యాప్ ఓపెన్ చేయగానే కింద హోం ఆప్షన్ పక్కకు స్టోర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని పై క్లిక్ చేసిన తర్వాత పలు ఆప్షన్లు చూయిస్తుంది. అందులో కరెంట్లీ ఆపరేషనల్, హోం డెలివరీ అనే ఆప్షన్లు కూడా కనిపిస్తాయి. వాటి పై క్లిక్ చేస్తే మీకు సమీపంలో ఏ షాపులు తెరిచి ఉన్నాయి. కరెంట్లీ ఆపరేషనల్ అయితే మనం వెళ్లి తీసుకోవచ్చు. హోం డెలీవరి అయితే మనం సరుకులు ఆర్డర్ చేసి పే నౌ అనే ఆప్షన్ ద్వారా బిల్లును చెల్లించవచ్చు. షాపు వారే సరుకులను మన అడ్రస్ కు డెలివరీ చేస్తారు. సరుకులను కాంటాక్ట్ లెస్ డెలివరీ పద్ధతిలో పొందవచ్చు. లాక్డౌన్ నేపథ్యంలో ఈ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఫోన్పే ఆఫ్లైన్ బిజినెస్ డెవలప్మెంట్ వీపీ వివేకక్ లాచెబ్ వెల్లడించారు. దీని ద్వారా వినియోగదారులు ఇళ్ల నుంచే తమకు కావలసిన నిత్యావసరాలను కొనుగోలు చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఇటు వినియోగదారులకు, అటు దుకాణాల యజమానులకు కూడా లాభదాయకంగా ఉంటుందని వివేక్ అభిప్రాయపడ్డారు. ఈ ఫీచర్ ద్వారా చాలా లాభాలున్నాయని ఫోన్ పే యూజర్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa