భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో లాక్ డౌన్ ను మే 3 వరకు పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇప్పటి వరకు దేశంలో 11వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 9756 యాక్టివ్ కేసులు కాగా, 1305 మంది డిశ్చార్జి అయ్యారు. భారత్ లో కొన్ని చోట్ల అసలు కరోనా ప్రభావమే లేదు. దీంతో అక్కడ ఏప్రిల్ 20 తర్వాత కొంత సడలింపు ఇస్తామని ప్రధాని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఒక్క కరోనా కేసు నమోదు కానీ జిల్లాలు 350 ఉన్నాయి. దీంతో తెలంగాణ ఏపీలో కూడా పలు జిల్లాలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణలో మంచిర్యాల, వరంగల్(రూరల్),యాదాద్రి భువనగిరి, వనపర్తి, నారాయణపేట జిల్లాలో అసలు కరోనా ప్రభావమే లేదు. దీంతో ఈ జిల్లాలకు ఏప్రిల్ 20 తర్వాత సడలింపు దక్కే అవకాశం ఉంది. ఏపీలో శ్రీకాకుళం,విజయనగరం జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. కరోనా ఫ్రీ జిల్లాలుగా విజయనగరం,శ్రీకాకుళం ఉన్నాయి. దీంతో ఏపీ నుంచి ఈ రెండు జిల్లాలకు ఏప్రిల్ 20 తర్వాత సడలింపు దక్కే అవకాశం ఉంది. ఆరెంజ్ జోన్, రెడ్ జోన్లలో మాత్రం లాక్డౌన్ మే 3 వరకు కొనసాగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa