హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) జారీ చేసిన కొత్త లాక్డౌన్ మార్గదర్శకాల ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తే జరిమానా విధించే అవకాశం ఉంది. కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా మే 3 వరకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను ప్రధాని మోడీ పొడిగించ సంగతి తెలిసిందే. దీంతో మద్యం, గుట్కా, పొగాకు మొదలైన అమ్మకాలపై నిషేధం ఉంది. దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దేశంలో కరోనా మహమ్మారిని నియంత్రించడానికి ప్రభత్వాలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం కోసం బీహార్ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. రోడ్లపై ఉమ్మి వేయడంపై నిషేధం విధించింది. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే రూ.200 జరిమానా లేదా, ఆరు నెలల జైలుశిక్ష విధిస్తామంటూ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇలా పబ్లిక్ ప్లేసుల్లో ఉమ్మి వేయడం వల్ల కరోనా, ఎన్సెఫాలిటిస్, ట్యూబర్క్యులోసిస్ వంటి రోగాలు వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఈ ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది. సినిమా హాల్స్, మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్, వ్యాయామశాలలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్విమ్మింగ్ పూల్స్, బార్స్ వంటి బహిరంగ ప్రదేశాలు కూడా మే 3వ తేది వరకు మూసివేయబడతాయి. అన్ని సామాజిక, రాజకీయ, క్రీడలు, మతపరమైన కార్యక్రమాలు, మతపరమైన ప్రదేశాలు, ప్రార్థనా స్థలాలు కూడా మూసివేయబడతాయి. 19 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ చేయడం వల్ల కోవిడ్ -19 యొక్క వ్యాప్తిని తగ్గించడానికి దోహదపడుతుంది. కరోనాను అరికట్టడానికి అన్ని ప్రదేశాలలో శానిటైజర్ను అందించాలని హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. చర్యల్లో భాగంగానే బహిరంగంగా ఉమ్మితే జరిమానా విధించాలని సూచనలు చేసింది. దీంతో హిమాచల్ ప్రదేశ్ కూడా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తే జరిమానా విధించేందుకు సిద్ధమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa