ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మే 3 వరకు రైళ్లు బంద్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 14, 2020, 02:56 PM

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావంతో మే 3 వరకు లాక్ డౌన్ పొడిగిస్తునట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ తెలిపిన విషయం తెలిసిందే. దీంతో మే 3 వరకు రైళ్లను రద్దు చేస్తునట్టుగా రైల్వే శాఖ ట్విట్టర్ లో తెలిపింది. భారతీయ రైల్వే అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. అన్ని ప్యాసింజర్ రైళ్లు, ప్రీమియం రైళ్లు, మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు, సబర్బన్ రైళ్లు, కోల్‌కతా మెట్రో రైల్, కొంకణ్ రైల్వే లాంటి సేవలన్నీ 2020 మే 3 వరకు రద్దు చేస్తున్నామని భారతీయ రైల్వే ట్విట్టర్‌లో వెల్లడించింది. మే 3 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో గూడ్స్ రైళ్లు మాత్రమే నడవనున్నాయి. ప్యాసింజర్ రైళ్లన్నీ రద్దయ్యాయి. లాక్ డౌన్ కు ముందే ఏప్రిల్ 15 నుంచి మే 3 వరకు టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఆటోమేటిక్ గా టికెట్లు క్యాన్సిల్ అవుతాయి. వారికి రీఫండ్ ద్వారా తిరిగి నగదు చెల్లించడం జరుగుతుందని సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa