ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో 473కు చేరిన కరోనా కేసులు...

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 14, 2020, 02:41 PM

ఏపీలో కరోనా వైరస్ రోజురోజుకు చాపకింద నీరులా విజృంభిస్తోంది. ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 473కి చేరింది. సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటలలోపు 34 కొత్త కేసులు నమోదు అయ్యాయని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఏపీలో కరోనా వ్యాప్తి నివారణ కోసం సర్కార్ పటిష్ట చర్యలు తీసుకుంటున్నా కేసుల సంఖ్య పెరగడం కలవరానికి గురిచేస్తుంది. ఇప్పటి వరకు జిల్లాల వారీగా నమోదైన కరోనా వైరస్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపూర్ 17, చిత్తూరు 23, తూర్పుగోదావరి 17, గుంటూరు 109,కడప 31, కృష్ణా 44, కర్నూలు 91, నెల్లూరు 56,ప్రకాశం 42, విశాఖ పట్నం 20, పశ్చిమ గోదావరి 23,విజయనగరం,శ్రీకాకుళంలో 0 కేసులు నమోదయ్యాయి. ఈ రోజు కొత్తగా గుంటూరు లో 16, కృష్ణాలో 8, కర్నూల్ లో 7, అనంతపూర్ లో 2 మరియు నెల్లూరు లో ఒక కేసు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 34 కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 473కి పెరిగింది. చిత్తూరు,తూర్పు గోదావరి,నెల్లూరు,ప్రకాశం నుంచి ఒక్కొక్కరు,కృష్ణా నుంచి నలుగురు, విశాఖపట్నం నుంచి ఆరుగురు డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 14కు చేరింది. అదే విధంగా కరోనాతో అనంతపూర్ లో 2, కృష్ణా జిల్లాలో 3,గుంటూరులో 2, కర్నూల్ లో 1, నెల్లూరులో 1 చనిపోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 9 మంది కరోనాతో చనిపోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa