ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో 22వేల వైఎస్సార్ జనతా బజార్లు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. రైతులకు అందుబాటులో ఉండేలా గ్రామాలు,పట్టణాల్లో వీటిని ఏర్పాటు చేయాలన్నారు. గ్రామ సచివాలయాలు,రైతు భరోసా కేంద్రాల పక్కకు ఇవి ఉండాలన్నారు. పట్టణాల్లో వార్డు కార్యాలయాల పక్కన ఇవి ఉండేలా చూడాలన్నారు. రైతుల ఉత్పత్తుల కోసం శీతలీకరణ కేంద్రాలు, రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉంచాలన్నారు. ఇందుకోసం ప్రతి గ్రామ సచివాలయం ఒక ట్రక్కును సమకూర్చుకోవాలన్నారు. లాభనష్టాలు లేని రీతిలో జనతా బజార్లను నిర్వహిస్తే ప్రజలకు మంచి ధరల్లో నిత్యావసర వస్తువులు లభిస్తాయని ఆయన అన్నారు. జనతా బజార్లలో రొయ్యలు చేపలు వంటి ఆక్వా ఉత్పత్తులు కూడా అమ్ముడు పోయేలా ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చే ప్రక్రియలో ఈ ప్రయత్నం మేలు చేస్తుందని సీఎం అన్నారు. సుమారు 22 వేల జనతా బజార్ల ఏర్పాటుతో అతి పెద్ద నెట్ వర్క్ ఏర్పడుతుందని ఆయన అన్నారు. ఇది సక్రమంగా చేయగలిగితే అటు రైతులకు, ఇటు వినియోగదారులకు మేలు జరుగుతుందని, గ్రామాల స్వరూపాలు మారిపోతాయన్నారు. వైఎస్సార్ జనతాబజార్ల ప్రాజెక్టుకు ఒక ఐఏఎస్ అధికారిని నియమించాలని ఆయన సీఎస్ ను ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa