ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బయటికొస్తే అడ్రస్ ప్రూఫ్ తప్పనిసరి... !

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 13, 2020, 03:10 PM

ఏపీలోని గుంటూరు జిల్లాలో 90 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లా అధికారులు అలర్ట్ అయ్యారు. లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఇక నుంచి ఎవరైనా రోడ్ల మీదికి వస్తే తప్పనిసరిగా అడ్రస్ ప్రూఫ్ ను వెంట తెచ్చుకోవాలన్నారు. అదే విధంగా ఇంటి నుంచి ఒక కిలోమీటర్ వరకే వాహనాలు తిరగాలన్నారు. నియమ నిబంధనలు పాటించని వారి పై పీడీ యాక్ట్ నమోదు చేసి, వాహనాలు సీజ్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు. అత్యవసరమైతేనే తప్ప బయటికి రావద్దన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa