ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం...

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 12, 2020, 02:09 PM

మన దేశంలో ఎక్కడబడితే అక్కడ రోడ్లపై ఉమ్మి వేయడం చాలా మందికి అలవాటు. ఇప్పుడు అలా చేస్తే నేరమే. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల్ని పాటిస్తూ... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జీవో జారీ చేసింది. దాని ప్రకారం... ఇకపై రోడ్లపై ఎక్కడబడితే అక్కడ ఉమ్మి వేస్తే... కేసు నమోదవుతుంది. పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలా, సుపారీ ఇలాంటివి తిన్నవారికి... నోట్లో లాలాజల గ్రంథులు ఊరి... లాలాజలం ఉత్పత్తి అవుతుంది. దాన్ని మింగితే ప్రమాదం కాబట్టి... చాలా మంది దాన్ని ఉమ్మివేస్తారు. కానీ ఇలా పబ్లిక్ ప్లేసెస్‌లో ఉమ్మితే... కరోనా వైరస్ ప్రబలే ప్రమాదం ఉంది కాబట్టి... ఇకపై అలా ఉమ్మితే కుదరదు. అసలా ఉత్పత్తులే మానేస్తే... ఉమ్మాల్సిన పనే ఉండదు. ఇలాంటి పొగాకు ఉత్పత్తుల వాడకం, తద్వారా ఉమ్మి వేసే విధానాలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. పబ్లిక్‌లో ఉమ్మి వేస్తే... కరోనా వైరస్ వ్యాపిస్తుందని పరిశోధనల్లో తేలింది కాబట్టి... ఏపీ ప్రభుత్వం... ఇకపై పొగాకు ఉత్పత్తులు, నమిలే పొగాకు వంటివి వాడరాదని స్పష్టం చేసింది. అలాగే... పబ్లిక్‌లో అంటే రోడ్లపైనా ఎక్కడబడితే అక్కడ ఉమ్మివేయడాన్ని నిషేధిస్తున్నామంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చేశాయి. ఉమ్మి వేస్తాం... ఏం చేస్తారంట... అని ఎవరైనా తెగిస్తే... వారిపై 1860 ఐపీసీలోని క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం చర్యలుంటాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa