తెలంగాణలో మంగళవారం 40 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 404కి చేరింది. ఇప్పటి వరకు 45 మంది డిశ్చార్జి కాగా 11 మంది మృతి చెందినట్టు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. తెలంగాణలో జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా - 11, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా - 4, హైదరాబాద్ - 171, జగిత్యాల - 3, జనగాం - 2, జయశంకర్ భూపాలపల్లి జిల్లా -1, జోగులాంబ గద్వాల జిల్లా- 22, కామారెడ్డి జిల్లా - 8, కరీంనగర్ -18, మహబూబాబాద్ జిల్లా - 1, మహబూబ్ నగర్ - 9, మెదక్ - 5, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా - 17, ములుగు-2, నాగర్ కర్నూల్ - 2, నల్గొండ- 13, నిర్మల్ -4 నిజామాబాద్ - 36 ,పెద్దపల్లి- 2, రంగారెడ్డి - 17 , సంగారెడ్డి - 7 , సిద్దిపేట - 1, సూర్యాపేట - 8, వరంగల్ అర్బన్ - 24, వికారాబాద్ - 4 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 45 మంది డిశ్చార్జి అయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం 2,హైదరాబాద్ 21,కరీంనగర్ 11,మహబూబ్ నగర్ 1, మేడ్చల్ 2, రంగారెడ్డి 7, వరంగల్ అర్బన్ 1 డిశ్చార్జి అయ్యారు. మరో వైపు ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 314కు చేరింది. ఇప్పటి వరకు ఆరుగురు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. జిల్లాల వారీగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలిలా ఉన్నాయి. అనంతపూర్ 6, చిత్తూరు 17, తూర్పుగోదావరి 11, గుంటూరు 41,కడప 28, కృష్ణా 29, కర్నూలు 74, నెల్లూరు 43,ప్రకాశం 24, విశాఖ పట్నం 20, పశ్చిమ గోదావరి 21,విజయనగరం,శ్రీకాకుళంలో 0 కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి,నెల్లూరు,ప్రకాశం,విశాఖపట్నం జిల్లాల నుంచి ఒక్కొక్కరు డిశ్చార్జి అయ్యారు. కృష్ణా నుంచి ఇద్దరు డిశ్చార్జి అయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa