కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. కేరళలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వం లాక్డౌన్ను మరింత కఠినతరం చేయాలని నిర్ణయించింది. లాక్డౌన్ సమయంలో కొందరు ప్రజలు ఏటీఎంలో డబ్బు డ్రా చేసేందుకు వెళుతున్నామని చెప్పి ఇతరత్రా పనులు చూసుకుంటున్నట్లు ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దీంతో పోస్టల్ సిబ్బందితో ఏటీఎంల వద్దకు జనం వెళ్లకుండానే ప్రజలకు డబ్బును అందజేయాలన్న ప్రతిపాదనకు కేరళ ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. దీని ద్వారా జనం లాక్డౌన్ వేళ బయట తిరగకుండా కట్టడి చేయడంతో పాటు ఏటీఎంల వద్ద గుమిగూడకుండా చేయొచ్చని కేరళ ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ ఇంటికే డబ్బు పంపిణీ సేవలు ఆధార్తో అనుసంధానమైన బ్యాంకు ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సేవలను వినియోగించుకోవాలనుకునే ప్రజలు స్థానిక పోస్టు ఆఫీసుల్లో తాము విత్డ్రా చేసుకునే డబ్బుకు సంబంధించి వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. అప్పుడు స్థానిక పోస్ట్ ఆఫీస్లో ఈ ప్రక్రియ మొదలవుతుంది. ఈ సేవలను వినియోగించుకునే బ్యాంకు ఖాతాదారులు ఒకసారికి పదివేలు మాత్రమే పొందగలరు. ఈ విధానాన్ని కేరళ ఏప్రిల్ 8వ తేది నుంచే అమలు చేయనుంది. కేరళ ప్రభుత్వం అంగన్ వాడీ విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజనాన్ని పిల్లల ఇంటిదగ్గరకు పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలో నెట్ వర్క్ సమస్యలు తలెత్తకుండా ఉండేలా మెరుగైన బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్ సౌకర్యాన్ని అందించేలా కేరళ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa