నెల్లూరు,సూర్యప్రతినిధి: మేం ప్రజాసేవకే రాజకీయాల్లోకి వచ్చాం నెల్లూరు ప్రజలు, తమ అభిమానులు, స్నేహితులను వదులు కోను వారి సంక్షేమానికి రాజకీయాలను వదులుకోను. నా తుది శ్వాస ఉన్నంత వరకు నెల్లూరు ప్రజల కోసమే పనిచేస్తా అంటూ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఆనం వివేకానం దరెడ్డి అన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా తనకు, తన సోదరుడు ఆనం రామనారా యణరెడ్డి మధ్య లేనిపోని గొడవలు, అభూత కల్పనలు సృష్టిస్తున్నారని తెలిపారు. అవి తనకు బూతులుగా వినిపిస్తున్నా యని, గతంలో ఈ తరహాలో ప్రచారం జరిగినప్పుడు ఖండించకపోవడమే తాను చేసిన పెద్ద తప్పంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ తామంటే గిట్టని వాళ్లు తమ అన్నదమ్ములు, కుటుంబాల మధ్య కలతలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆవేదన వ్యక్తం చేశారు. తన తమ్ముడు అడిగితే ఎంత పెద్ద పదవెనా, ఏ త్యాగమైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. సోదరులిద్దరం కలసి విజయవాడలో మంత్రి నారాయణ, లోకేష్, కళా వెంకట్రావులను కలసి జిల్లా రాజకీయాలు, ఎమ్మెల్సీని ఎలా గెలిపించుకోవాలో సమాలోచనలు చేశామేగానీ ఇంకేమీ లేదన్నారు. చంద్రబాబునాయుడ్ని తానొక్కడ్నే కలిశానన్న అంశాన్ని పెద్ద రాద్దాంతం చేయడం, ఎమ్మెల్సీ పదవి విషయంలో ఆనం సోదరుల మధ్య విభేదాలొ చ్చాయన్న ప్రచారం తనను బాధించిందన్నారు. తనకు ఎమ్మెల్సీ కావాలని కోరిక ఉందని, అయితే అది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కాదని పరోక్షంగా గవర్నర్ కోటా కింద ఇస్తే కాదనని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.