అనంతపురం, మేజర్న్యూస్ : సీఎం చంద్రబాబు కసాయిలా వ్యవహరిస్తున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి విమర్శించారు. అనంతపురం పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరువు తాండవిస్తున్నా ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఏపీలో రైతుల ఆత్మహత్యలు, వలసలు రోజురో జుకు పెరిగిపోయాయని పేర్కొన్నారు. లక్షల సంఖ్యలో పశువులు కబేళాకు వెళ్తున్నా చంద్రబాబు ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని రఘువీరా విమర్శించారు.