ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లేఖలో పలు సూచనలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 25, 2020, 04:27 PM

కరోనా నియంత్రణ చర్యల నేపథ్యంలో సీఎం జగన్​కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ప్రభుత్వం తీసుకుంటున్న నియంత్రణ చర్యలు, పేద కుటుంబాలను ఆదుకోవడంపై.... లేఖలో పలు సూచనలు చేశారు. ప్రతి పేద కుటుంబానికి 2 నెలలకు నిత్యావసరాలు డోర్ డెలివరీ చేయడంతో పాటు.... 5 వేలు నగదు సాయం చేయాలని చంద్రబాబు కోరారు. నిత్యావసరాల ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు.... ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.బ్లాక్ మార్కెటింగ్‌, దళారుల బెడదకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని.... విదేశాల నుంచి వచ్చినవారిని క్వారంటైన్ చేయాలని.... ఐసోలేషన్ వార్డులు, ప్రత్యేక ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని సూచించారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa