ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలను మభ్యపెడుతున్న టిడిపి ప్రభుత్వం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 07, 2017, 01:25 AM

  నరసాపురం,మేజర్‌న్యూస్‌ః మోసపూరిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన తెలుగు దేశం ప్రభుత్వం నేటికి ప్రజలను మభ్య పెట్టేందుకు చూస్తుందని పశ్చిమ గోదావరి జిల్లా వైకాపా అధ్యక్షులు ఆళ్ళ నాని  విమర్శించారు. మంగళవారం వైకాపా నియోజకవర్గ స్ధాయి ప్లీనరీ సమావేశం స్ధానిక అల్లూరి సత్యనారాయణ రాజు కళ్యాణ మండపంలో నరసాపురం నియోజక వర్గ సమన్యయకర్త ముందు నూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో జరిగింది. ఈ ప్లీనరీకి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆళ్ళ నాని ప్రభుత్వంపై విమర్శలు గుప్పిం చారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిపక్ష వైకాపాను నిందించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. అభివృద్ది  పేరుతో అవినీతికి గేట్లు తెరిచారన్నారు. ఇటీవల నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడులో రాష్ట్ర అభ్యున్నతికి ఉపయో గపడే తీర్మానాలు చేయలేదని, ప్రచారం కోసం ప్రజా సొమ్ముతో ఏటా మహా నాడు నిర్వహిస్తున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు మాట్లా డుతూ నియోజక వర్గంలో పెండింగ్‌ ప్రాజెక్టుల పరిష్కారానికి ఈ ప్రభుత్వం చేసింది శూన్యమన్నారు. మాజీ ముఖ్యమంత్రి రాజన్న పాలన లాంటి పాలన అందించడానికి ఆయన తనయుడు, వైకాపా అధినేత జగన్‌మెహన్‌రెడ్డి పాలన కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని ముదునూరి తెలిపారు. ఈ కార్య క్రమంలో ప్లీనరీ సమన్వయకర్త కొయ్యె మోషన్‌రాజు, సీని యర్‌ నాయకులు మేకా శేషుబాబు,  గుణ్ణం నాగబాబు, పుప్పాల ఏసు బాబు, సాయినాథ్‌ ప్రసాద్‌, పి.డి రాజు, సయ్యప్పురాజు వర్మ, పాలంకి ప్రసాద్‌, సోమ రాజు భరత్‌, దొంగ మురళి, కామన బుజ్జి, ఏడిద కోట సత్యనారా యణ,(వైకెఎస్‌), బుడితి అనీల్‌ కుమార్‌, దొండపాటి స్వామి, తేన్నేటి సురేష్‌ , ఫాషాఖాన్‌, సఖినేటిపల్లి సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com