ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రాభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ : ఎమ్మెల్యే బండారు

Andhra Pradesh Telugu |  IANS  | Published : Wed, Jun 07, 2017, 12:43 AM

  నరసాపురం , మేజర్‌న్యూస్‌ః నవ నిర్మాణ దీక్ష 5 వ రోజు మానవ వనరుల అభివృద్ధిపై  మండల పరిషత్‌ కార్యాలయంలో  వివిధ శాఖాధికారులతో సమావేశం జరిగింది. ఈ  సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా పాల్గొన్ని మాట్లాడుతూ రాష్ట్రాన్ని రంగాలలో మందుకు తీసుకెళ్ళడానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమిస్తున్నారని, అందులో భాగంగానే విధ్యా వ్వవస్ధ పటిష్టత కోసం విలువలతో కూడిన విధ్యను విధ్యార్ధులకు అదించడం ద్వారా ఉత్తమ పౌరులుగా తర్చి దిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాష్ట్రాన్ని ఎడ్యూకేషనల్‌ హబ్‌గా , నాలెడ్జ్‌ హబ్‌గా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.బడి పిలుస్తొంది వంటి కార్యక్రమాల ద్వారా చదువు మానివేసిన పిల్లలను బడివైపు నడిపించడానికి చర్యలు తీసుకున్నామన్నారు. బాలికలకు ప్రభుత్వం సైకిళ్ళు పంపిణీ చేసిందన్నారు. సమాజంలో అనిన వర్గాల వారు విధ్యా వంతులు కావాలనే లక్ష్యంతో ఎస్సీ, ఎస్టీ, బి.సి  ,వెనుక బడిన వర్గాలతో పాటు ఉన్నత వర్గాలలోని పేదలకు విధ్య, విదేశి విధ్య కోసం ఆర్ధిక సహాయం   ప్రభుత్వం అందిస్తుందన్నారు. కార్పోరేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను  డిజిటలైజ్‌ చేసి ఉత్తమ విధ్య అందిస్తున్న ప్రభుత్వ కార్యక్రమాలకు ఉపాధ్యాయులు అంకిత భావంతో ప్రతి విధ్యార్ధిని ప్రత్యేక శ్రద్ధతో ఉత్త్మ పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. ఆరోగ్య రంగం గూరించి మాట్లాడుతూ పేదల ఆరోగ్యం కోసం ప్రభుత్వం అనేక పధకాలను ప్రవేశ పెట్టిందన్నారు. ఎన్టీఆర్‌ వైధ్య సేవ ద్వారా1038 వ్వాదులకు ఖరీదైన వైధ్యం అందిస్తున్న ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే నన్నారు.


    ఆరోగ్య భధ్రతలో భాగంగా చంద్రన్న భీమా, ఆరోగ్య రక్షణ వంటి పధకాలను చంద్రబాబు అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పసుపులేటి రత్నమాల సాయి, ఎఎంసి చైర్మన్‌ శ్రీరాములు, ఎంపిటిసిలు,  


 సర ్పంచులు, వివిధశాఖాధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com