ఏపీ సర్కార్ సంక్షేమ పథకాల అమలులో రాజీపడడం లేదు. పెన్షన్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్కార్ నేటి నుంచి కొత్తగా మరో 5 లక్షల మందికి కూడా పెన్షన్లు అందజేస్తుంది. జనవరిలో 54,68,322 మందికి పెన్షన్లు అందజేశారు. జనవరిలో పెన్షన్లు రాని వారి ఫిర్యాదు చేశారు. వారికి సంబంధించి రీ వెరిఫికేషన్ చేశారు. అలాగే మరి కొంత మంది కొత్త లబ్దిదారులను కూడా ఎంపిక చేశారు. దీంతో ఫిబ్రవరిలో పెన్షన్లు పొందే వారి సంఖ్య పెరిగింది. మొత్తం 60 లక్షల మందికి పెన్షన్లు అందజేస్తున్నారు. 15 రకాల పెన్షన్లను ప్రభుత్వం ఇస్తోంది. రాష్ట్ర బడ్జెట్లో దాదాపు 10 శాతం డబ్బును పెన్షన్ల కోసమే ప్రభుత్వం కేటాయిస్తోంది. గ్రామ వార్డు వాలంటీర్లు నేరుగా అర్హుల ఇంటికే వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నారు. పెన్షన్ల కోసం ప్రభుత్వం ప్రతి నెల 1350 కోట్ల రూపాయలకు పైగా కేటాయిస్తోంది.
- వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత,గీతా కార్మికులకు రూ.2250 పెన్షన్ అందిస్తున్నారు.
- దివ్యాంగులు, డప్పు కళాకారులకు,చర్మకారులకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి రూ.3000 అందిస్తున్నారు.
- తలసేమియా ఉన్న వారికి, బోధకాలతో బాధపడేవారికి, కిడ్నీ సమస్యతో డయాలసిస్ చేయించుకునే వారికి రూ.5000 అందిస్తున్నారు.
- ఇక పక్షవాతం, సికిల్ సెల్ (రక్తహీనత)తో బాధపడేవారికి నెలకు రూ.10,000 లను ప్రభుత్వం పెన్షన్ గా ఇస్తోంది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa