కొవ్వూరు: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో దర్శకరత్న దాసరి నారాయణరావు అస్తికల నిమజ్జన క్రతువును శనివారం నిర్వహించారు. పెద్దకుమారుడు తారకప్రభు పిండ ప్రదానశాలలో క్రతువు నిర్వహించి గోదావరి నది మధ్యలో నిమజ్జనం పూర్తిచేశారు. అస్తికలను కృష్ణా నది, కాశీలోని గంగా నదిలోనూ కలుపుతారని ఎంపీ మురళీమోహన్ సోదరుని కుమారుడు శ్రీనివాస్ తెలిపారు. నిమజ్జన కార్యక్రమంలోనటి ప్రభ సోదరుడు, ఎడిటర్ నార్ల గంగాధర్, బంధువు తాండవకృష్ణ, సత్యనారాయణ తదితరులున్నారు.