మూడో దశ వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. 3వ దశ కంటివెలుగు కార్యక్రమంలో 56.88 లక్షల మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. సీఎం జగన్ మాట్లాడుతూ... అవ్వా తాతలకు ఎంత చేసినా తక్కువే అని సీఎం జగన్ అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల రూపు రేఖలు మార్చడానికి నాడు- నేడు కార్యక్రమం చేపట్టామని అన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులకు ఏ మాత్రం తీసిపోని విధంగా తయారు చేస్తామని అన్నారు. ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో ఐపీఎహ్ ప్రమాణాలను తీసుకొస్తామని అన్నారు. జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రభుత్వ ఆస్పత్రులు తయారు చేస్తామని అన్నారు. రూ. 15,337 కోట్లతో ఆస్పత్రుల అభివృద్ధి చేపడుతున్నామని సీఎం తెలిపారు. నాడు- నేడు కార్యక్రమంలో మూడేళ్ళ తర్వాత మార్పు చూడొచ్చు అని సీఎం జగన్ అన్నారు.