ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్ఆర్ కంటి వెలుగు మూడో విడత కార్యక్రమం ప్రారంభమైంది. కర్నూలులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడో దశ కంటి వెలుగును ప్రారంభించారు. అలాగే నాడు -నేడు కార్యక్రమంలో భాగంగా నూతనంగా నిర్మించనున్న హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణానికి జగన్ శంకుస్థాపన చేశారు. ఆరోగ్యశ్రీ స్మార్ట్ హెల్త్ కార్డులను సీఎం జగన్ లబ్ధిదారులకు అందజేయనున్నారు. 56.88 లక్షల మందికి కంటి వైద్య పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.