కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఓ విషాద ఘటన చోటుచేసికుంది. ప్రేమికులంతా ప్రేమికుల రోజు సందర్భంగా పండుగ చేసుకుంటోన్న నేపథ్యంలో ఓ ప్రేమికుడు మాత్రం తన ప్రేమ విఫలమైందన్న కారణంతో ఆత్మహత్య చేసుకున్నడు. కృష్ణ అనే యువకుడు ఇంట్లో ఉరివేసుకుని ఈ ఘటనకు పాల్పడ్డాడు. అతడు ఎమ్మిగనూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.