జనసేన అధినేత పవన్ కల్యాణ్కు కర్నూల్లో పర్యటన ప్రారంభం కాకముందే నిరసన సెగలు మొదలయ్యాయి. పవన్ కల్యాణ్ గో బ్యాక్ అంటూ విద్యార్థి సంఘాల జేఏసీ నినాదాలు చేస్తున్నారు. దీంతో ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మరోవైపు పవన్, కర్నూల్కు చేరుకున్నారు. సుగాలి ప్రీతి కేసులో నిందితులకు శిక్ష పడాలంటూ చేస్తోన్న ర్యాలీలో ఆయన పాల్గొనబోతున్నారు.